కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 15 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా... ఏకంగా 12 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాలకే పరిమితం కావడంతో.. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓటమికి నైతికి బాధ్యత వహిస్తూ.. శాసనసభలో కాంగ్రెస్ పక్షనేత పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రతిపక్ష నేతగా ప్రజా తీర్పును తాను గౌరవించాలని చెప్పారు. సీఎల్పీ పదవికి రాజీనామా చేశానని, ఈ మేరకు పార్టీ అధిష్టానానికి రాజీనామా లేఖను పంపినట్టు తెలిపారు.