ప్రపంచ వ్యాప్తంగా సంచలన సృష్టించిన నిర్భయ హత్యకేసు దోషులకు ఉరిశిక్ష ఖరారైంది. ఈనెల 16వ తేదీ ఉదయం 5గంటలకు తీహార్ జైల్లో నిందితులను ఉరి తీయనున్నారు. నిర్భయ సంఘటన జరిగి దాదాపు ఏడేళ్లు గడిచాయి. ఇప్పటికే నిందితులు అన్ని న్యాయస్థానాలను ఆశ్రయించారు. చివరిగా రాష్ట్రపతి క్షమాబిక్ష కోసం ప్రయత్నించారు. రాష్ట్రపతి తిరస్కరించడంతో ఈ నెల 16వ తేదీన ఉరిశిక్షను అమలు చేయాలని నిర్ణయించింది. నిర్భయ కేసులో ఆరుగురు నిందితులు రామ్ సింగ్(33), ముకేష్ సింగ్(24), , వినయ్ శర్మ(22), పవన్ గుప్తా(20) , అక్షయ్ ఠాకూర్(29), మరో మైనర్ నిందితుడు మహ్మద్ అఫ్రోజ్(17సంవత్సరాల 6నెలలు). నిర్భయ నిందితుల్లో మైనర్ అఫ్రోజ్ మైనర్ కావడంతో జువైనల్ కోర్ట్ మూడు సంవత్సరాల జైలుశిక్షతో భయటపడ్డాడు. ప్రధాన నిందితుడు రామ్ సింగ్ 2013మార్చ్ 11న తీహార్ జైల్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురు నిందితులైన ముకేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్ లకు ఉరిశిక్షే సరైందని ట్రయల్ కోర్ట్, హైకోర్ట్, సుప్రీం కోర్ట్ లు సైతం తీర్పునిచ్చాయి.