ఇటీవల జరిగిన ప్రపంచకప్లో, ఆ తర్వాత భారత పర్యటనలో దక్షిణాఫ్రికా జట్టు పేలవ ప్రదర్శన చేసి ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. జట్టు బలహీనంగా మారడంతో దక్షిణాఫ్రికా సంతతికి చెందిన పీటర్సన్ ట్విట్టర్ వేదికగా ఓ సలహా ఇచ్చాడు. నేను దక్షిణాఫ్రికా జట్టు సమస్యలను పరిష్కరిస్తా అని ఓ ట్వీట్ చేసాడు. దక్షిణాఫ్రికా బోర్డు డైరెక్టర్గా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్, హెడ్ కోచ్గా వికెట్ కీపర్ మార్క్ బౌచర్, బౌలింగ్ కోచ్గా పేసర్ మఖాయ ఎన్తినీ, స్పిన్ కోచ్గా ఆల్రౌండర్ రాబిన్ పీటర్సన్, దక్షిణాఫ్రికా క్రికెట్ సీఈవో మరియు జట్టు కన్సల్టెంట్గా ఆల్రౌండర్ జాక్వస్ కలిస్ బాధ్యతలు చేపట్టాలని పీటర్సన్ ట్వీట్ చేయాడు. వీరందరూ బాధ్యతలు చేపడితే దక్షిణాఫ్రికా క్రికెట్ పూర్వవైభవాన్ని అందుకుంటుందని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు.