విశాఖపట్నం : శ్రీలంక, దక్షిణ తమిళనాడును ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో ఎక్కువచోట్ల మంగళవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. ఆళ్లగడ్డలో 3, మార్కాపురంలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 24 గంటల్లో రాయలసీమ, కోస్తాల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.