అన్యాయం గా వివేకానంద రెడ్డి ని చంపేశారని.. ఇంటి దొంగలే ఆపని చేశారని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. కర్నూలులో దివ్యాంగులు, వైకాపా బాధితుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ… వివేకానందరెడ్డి హత్య సమయంలో తాను ముఖ్యమంత్రి గా ఉన్నాను కాబట్టి కేసు నీరు గార్చకుండా విచారణ చేయించానన్నారు. టీడీపీలో చురుగ్గా ఉన్నవాళ్ళ పై కక్ష సాధించడo కోసం కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. ప్రియాంక రెడ్డిపై అత్యాచారం చేసి దారుణంగా చంపడం హేయమైన చర్య అన్నారు. అక్కడ లా అండ్ ఆర్డర్ ఏవిదంగా ఉందో మనకు అర్థమవుతుందన్నారు. మహిళలు ఎవరూ ఇంట్లో నుండి బయటకు రావాలంటే నే భయపడే పరిస్థితి ఉందన్నారు. నాగరిక ప్రపంచంలో అనాగరికoగా ప్రవర్తిస్తున్నారన్నారు. ఇది ఉన్మాద ప్రభుత్వం.. రాక్షస ప్రభుత్వం.. దుర్మార్గపు ప్రభుత్వమన్నారు. కొంత మంది పోలీసులు ఎక్స్ ట్రాలు చేస్తున్నారని, తాము రెచ్చిపోతే ఎవరూ తట్టుకోలేరు జాగ్రత్త అన్నారు. లా అండ్ ఆర్డర్ తో ఆటలు ఆడుతున్నారు జాగ్రత్త.. అదే మీ పతనానికి దారి తీస్తుందన్నారు.