ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ - 39/2...

international |  Suryaa Desk  | Published : Sat, Nov 30, 2019, 06:06 PM

ఆతిథ్య న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ రెండో రోజు ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి, 39 పరుగులు చేసింది. బర్న్స్‌(24), కెప్టెన్‌ రూట్‌ (6) క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంగ్లాండ్‌ ఇంకా 336 పరుగులు వెనుకబడి ఉంది. కాగా, న్యూజిలాండ్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ, మాట్‌ హెన్రీ చెరో వికెట్‌ పడగొట్టారు. అంతకు ముందు న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 375 పరుగులకు ఆలౌట్‌ అయింది. టామ్‌ లాథమ్‌ సెంచరీ(105)తో చెలరేగగా.. టేలర్‌(53), వాట్లింగ్‌(55), మిచెల్‌(73) అర్ధసెంచరీలతో రాణించడంతో ఇంగ్లాండ్‌ ముందు భారీ స్కోరు ఉంచగలిగింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో స్టువర్ట్‌ బ్రాడ్‌ 4 వికెట్లు పడగొట్టగా, క్రిస్‌ ఓక్స్‌ 3వికెట్లతో రాణించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com