అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే నైట్ టెస్టులో పాకిస్థాన్ ఫీల్డింగ్లో నిరాశ పరుస్తోంది. తమ పేలవ ఫీల్డింగ్తో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. దీంతో పాకిస్థాన్ ఆటగాళ్ల ఫీల్డింగ్పై ఆ దేశ మాజీ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ మండిపడ్డాడు. నిద్ర మత్తులో ఫీల్డింగ్ చేస్తున్నారా? అంటూ విమర్శించాడు. "షాహీన్ అఫ్రిది ఊహాలోకంలో ఉన్నట్లు, యాషిర్షా, షాన్ మసూద్ నిద్రమత్తుతో ఉన్నట్లు ఫీల్డింగ్ చేశారు. పాక్ క్రికెట్కు ఫీల్డింగ్ అతిపెద్ద సమస్య. బంతిపై దృష్టి కేంద్రీకరించాలి. ఫీల్డర్ వెనుక బ్యాకప్గా ఎవరూ ఫీల్డింగ్ చేయట్లేదు. నేను ఫీల్డింగ్ చేసేటప్పుడు బౌండరీ లైన్ దగ్గరగా కాకుండా పది గజాల ముందే నిలబడేవాడిని" అని వసీం అక్రమ్ అన్నాడు. కాగా, అడిలైడ్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో తొలిరోజు ఫీల్డింగ్లో పాకిస్థాన్ వైఫల్యం చెందింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యాసిర్ షా, మసూద్లతో పాటు షాహిన్ అఫ్రిది ఫీల్డింగ్లో నిరాశపరిచాడు. బౌండరీ వెళ్లకుండా ఆపాల్సిన బంతిని కాలితో తన్ని మరీ బౌండరీకి పంపించాడు. కాగా, అడిలైడ్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో తొలిరోజు ఫీల్డింగ్లో పాకిస్థాన్ వైఫల్యం చెందింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యాసిర్ షా, మసూద్లతో పాటు షాహిన్ అఫ్రిది ఫీల్డింగ్లో నిరాశపరిచాడు. బౌండరీ వెళ్లకుండా ఆపాల్సిన బంతిని కాలితో తన్ని మరీ బౌండరీకి పంపించాడు.