ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్కూల్ విద్యార్థులకు తీపి కబురు అందించారు. పాఠశాల విద్య, మధ్యాహ్న భోజన పథకంపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్..ఇక ఫై స్కూల్ విద్యార్థులకు ప్రత్యేక కిట్ ను ఇవ్వాలని నిర్ణయించారు.
ప్రతి విద్యార్థికి స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్, టెక్ట్స్ బుక్స్, 3 జతల యూనిఫాం, జత బూట్లు, సాక్సులతో కూడిన కిట్లు అందించాలని నిర్ణయించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి వీటిని విద్యార్థులకు అందజేయనున్నారు. గతంలో జగన్ ప్రకటించిన దానికంటే అదనంగా స్కూలు బ్యాగ్, నోట్ బుక్స్ కిట్లో చేర్చారు. యూనిఫామ్కు సంబంధించిన కుట్టు కూలీ, జత షూస్, సాక్సుల కొనుగోలు కోసం డబ్బులు ఇస్తారు.. మిగిలిన వస్తువులను కిట్ల రూపంలో అందజేస్తారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఫై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.