ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్, శ్రీలంక మైత్రీ మరింత బలోపేతం

international |  Suryaa Desk  | Published : Fri, Nov 29, 2019, 03:08 PM

 భారత్, శ్రీలంక దేశాల మధ్య మైత్రీ సంబంధాలు బలంగా ఉన్నాయని, వీటిని మరింత ఉన్నతస్థాయికి తీసుకువెళతామని శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స అన్నారు. ఇటీవల శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన రాజపక్స తొలిసారి విదేశీ పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈమేరకు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కాగా రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన రాజపక్సకు రాష్టప్రతి భవన్ వద్ద రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ సాదర స్వాగతం పలికారు. అనంతరం రాజపక్స విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కలుసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com