పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు ముందుకు వెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముంఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం పూలే 129వ జయంతి సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేద విద్యార్థుల చదువు కోసం ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భర్తిస్తుందని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. బలహీనవర్గాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు.