ఇంగ్లీష్ మీడియంపై ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, జనేసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, రాష్ట్ర బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మినారాయణ.. ఈ ముగ్గురి వాయిస్ ఒక్కటేనని..ప్రభుత్వంపై నిందలు వేయడమే వారి పని అని మంత్రి విమర్శించారు. తెలుగు వద్దని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. చివరికి దేవుళ్ల మీద కూడా రాజకీయాలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు. తిరుపతిలో అన్యమత ప్రచారం జరుగుతోందంటూ.. హిందువుల్లో భ్రమ కల్పిస్తున్నారన్నారు.