ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ. 21వేలు జరిమానా చెల్లించిన బంగ్లా ఓపెనర్!

international |  Suryaa Desk  | Published : Thu, Nov 28, 2019, 01:10 PM

భారత్‌లో బంగ్లాదేశ్ పర్యటన ముగిసినప్పటికీ రెండు రోజుల పాటు ఉండటంతో బంగ్లాదేశ్ రిజర్వ్ ఓపెనర్ సైప్ హాసన్ రూ.21,6000లను జరిమానాగా చెల్లించాడు. వీసా ముగిసినప్పటికీ భారత్‌లో ఉన్నందుకు గాను కేంద్ర విమానయాన శాఖ అతడికి ఈ జరిమానా విధించింది. గత నెలలో బంగ్లాదేశ్ జట్టు మూడు టీ20లు, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడేందుకు భారత దేశానికి వచ్చింది. గత ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన డే నైట్ టెస్టుతో భారత్‌లో బంగ్లాదేశ్ పర్యటన ముగిసింది. ఈ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మరుసటి రోజైన సోమవారం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ఢాకాకు బయల్దేరి వెళ్లింది. భారత్‌లో రెండు రోజుల పాటు ఉండేందుకు గాను ఢాకాలోని భారత హైకమిషన్ అతడి వీసాను రెండు రోజుల పాటు పొడిగించింది. అయితే, వీసా పొడిగించినా... కొన్ని గంటలు భారత్‌‌లో అదనంగా ఉండటంతో అతడికి ఈ జరిమానా విధించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com