న్యూ ఢిల్లీ : మూడు ప్రధాన రైళ్లలో భోజనం ధరలు పెంచుతూ ఐఆర్సీటీసీ నిర్ణయం తీసుకుంది. రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో భోజనం ధరలు పెరిగాయి. ఈ రైళ్లలో ఇప్పటివరకు మొదటి ఏసీ క్లాస్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో ప్రయాణించే వారు కప్పు టీ కి 29 రూపాయలు చెల్లించేవారు. ఇకనుంచి రూ. 35 చెల్లించాలి. అల్పాహారాన్ని 7 రూపాయలు పెంచడంతో అది 140 అయింది. మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంపై 15 రూపాయలు పెంచారు. దీంతో దాని ధర 245 అయింది. సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, చైర్ కార్ లో ప్రయాణించేవారు కప్పు టీ కి 20, అల్పాహారానికి 105, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి 185 రూపాయలు చెల్లించాలి. పెంచిన ధరలు 15 రోజుల్లో అమల్లోకి వస్తాయి.