ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండోర్ టెస్టులో సిక్స్‌తో డబుల్ సెంచరీ సాధించిన మయాంక్

national |  Suryaa Desk  | Published : Fri, Nov 15, 2019, 04:27 PM

ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతన్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. 304 బంతుల్లో 25 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 202 పరుగులు చేశాడు. టెస్టుల్లో మయాంక్ అగర్వాల్‌కు ఇది రెండో డబుల్ సెంచరీ. ఈ మ్యాచ్‌లో మయాంక్ సిక్స్‌తో డబుల్ సెంచరీ సాధించడం విశేషం. మయాంక్ డబుల్ సెంచరీతో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. ప్రస్తుతం 102 ఓవర్లకు గాను టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 376 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ అగర్వాల్(211), రవీంద్ర జడేజా(14) పరుగులతో ఉన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com