న్యూఢిల్లి : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేడు మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. రాజ్ఘాట్కు వచ్చిన ఆయన మహాత్ముడి సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఆదివారంనాడు జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేయనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు కూడా ఆయన ఇక్కడకు వచ్చి మహాత్ముడికి నివాళులర్పించారు.