నవీ ముంబైలో 11వ తరగతి చదవుతున్న విద్యార్థి ఒకరు స్కూల్లోని వాష్రూమ్లో తనపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడని నవీ ముంబై డిసిపి అశోక్ డూధే చెప్పారు. అతడిని వెంటనే ఐరోలిలోని నేషనల్ బర్న్ సెంటర్కు చికిత్స నిమిత్తం తరలించామని ఆయన అన్నారు. ఆ విద్యార్థం ఆత్మహత్యాయత్నానికి ఎందుకు పాల్పడ్డాడో తెలుసుకోవాల్సి ఉందని ఆయన అన్నారు.