ఢిల్లిలో అమలు చేస్తున్న బేసి – సరి విధానం నేటితో ముగియనున్నది. వెంటనే దీనిని పొడిగించే అవకాశం లేదని ముఖ్యమంత్రి చెప్పారు. సోమవారం వరకూ పరిస్థితిని సమీక్షించి సోమవారంనాడు ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. వాతావరణాన్ని పరిశీలించే సంస్థలు వచ్చే రెండు మూడు రోజుల్లో కాలుష్యం స్థాయి తగ్గుతుందని చెప్పాయని ఆయన అన్నారు. సరి బేసి విధానాన్ని తాము పొడిగించి ప్రజలను మరింత ఇబ్బందిపెట్టదలచుకోలేదని ఆయన అన్నారు.