ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాలి నాణ్యత పెరగకపోతే సరి-బేసి విధానం కొనసాగింపు

national |  Suryaa Desk  | Published : Fri, Nov 15, 2019, 12:37 PM

ఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీని కాలుష్యం కమ్మేసిన విషయం తెలిసిందే. గాలి కాలుష్య తీవ్రతపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు మీడియాతో మాట్లాడుతూ.. వాతావరణశాఖ అధికారుల సమాచారం మేరకు రానున్న రెండు మూడు రోజుల్లో కాలుష్యం తగ్గి గాలి నాణ్యత పెరగనుందన్నారు. ఒకవేళ గాలి నాణ్యత పెరగకపోతే ఇప్పటికే అమలు చేస్తున్న వాహనాల సరి-బేసి విధానాన్ని కొనసాగించనున్నట్లు ఆయన తెలిపారు. కాలుష్యం తగ్గి వాతావరణ పరిస్థితులు అనుకూలించే వరకు మరో మూడు రోజులు సరి-బేసి విధానాన్ని పొడిగించనున్నట్లు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com