న్యూఢిల్లీ : భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా తన చివరి పనిదినాన్ని జస్టిస్ రంజన్ గోగోయ్ శుక్రవారం ప్రత్యేకంగా ముగించుకున్నారు. తన ధర్మాసనంలో విచారణకు లిస్ట్ అయిన పిటిషన్లకు ఒకేసారి నోటీసులు జారీ చేశారు రంజన్ గోగోయ్. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంజన్ గోగోయ్కు సాయంత్రం 4 గంటలకు వీడ్కోలు పలకనున్నారు. ఈ నెల 17వ తేదీన రంజన్ గోగోయ్ పదవీ విరమణ పొందనున్నారు. మహారాష్ట్రకు చెందిన జస్టిస్ శరద్ అర్వింద్ బోబ్డే (63) ఈ నెల 17న చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ స్థానంలో భారత సర్వోన్నత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు.