పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 18వ తేదీ నుంచి డిసెంబర్ 13 వరకు జరగనున్నాయి. 20 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు ఉంటాయని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. నవంబర్ 17న అన్ని పార్టీల నేతలతో సమావేశం కానున్నట్లు, దానికి సంబంధించి అన్ని పార్టీలకు సమాచారం అందించినట్లు వెల్లడించారు. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, ఆర్థిక మందగమనం లాంటి అంశాలను సమావేశాల్లో లేవనెత్తేందుకు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి.