కర్ణాటకలో జరిగిన అర్బన్ లోకల్ బాడీ (యుఎల్బి) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 151 స్థానాల్లో విజయం సాధించింది. బిజెపి 125 సీట్లు గెలుచుకుంది. మాజీ ప్రధాని దేవెగౌడకు చెందిన జనతాదళ్ సెక్యులర్ (జెడిఎస్) 63 స్థానాల్లో విజయం సాధించి మూడవ స్థానంలో నిలిచింది. యుఎల్బి ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించడం పట్ల రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు హర్షం వ్యక్తం చేశారు.