న్యూఢిల్లీ : నికోబార్ దీవుల్లో శుక్రవారం భూప్రకంపనలు సంభవించాయి. నికోబార్ దీవుల్లో గురువారం అర్దరాత్రి దాటాక భూమి ప్రకంపించడంతో ప్రజలు భయాందోళనలు చెందారు. భూప్రకంపనలతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. నికోబార్ దీవుల్లో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైందని భారత వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ఈ భూప్రకంపనలతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని నికోబార్ అధికారులు చెప్పారు.