ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఎస్బీఐ ఏటీఎం కమ్ డెబిట్ కార్డులపై ప్రమోషనల్ ఆఫర్ అందిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫర్లో భాగంగా కస్టమర్లకు ట్రాన్సాక్షన్ అమౌంట్పై 1 శాతం క్యాష్బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్ 2019 డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఎస్బీఐ డెబిట్ కార్డ్ క్యాష్బ్యాక్ స్కీమ్ 18 ఏళ్లకు పైన వయసుక లిగిన వారందరికీ అందుబాటులో ఉంది. అయితే వీరి వద్ద వాలిడ్ ఎస్బీఐ మాస్టర్ కార్డ్ ఈఎంఐ చిప్ డెబిట్ కార్డు ఉండాలి. ఎస్బీఐ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు, ఎస్బీఐ ఏజెంట్స్ వంటి వారికి ఈ ప్రమోషనల్ ఆఫర్ వర్తించదు. స్టేట్ బ్యాంక్ క్యాష్బ్యాక్ ఆఫర్ విదేశాల్లో పీఓఎస్ మెషీన్లు, ఇతర కొనుగోళ్లకు మాత్రమే వర్తిస్తుంది. కార్పొరేట్ కార్డ్ కలిగిన వారికి ఈ ప్రమోషనల్ ఆఫర్ వర్తించదు. అలాగే మినిమమ్ ట్రాన్సాక్షన్ వ్యాల్యూ కూడా ఉంటుంది. దీనికి పైన చేసిన లావాదేవీలకు మాత్రమే క్యాష్బ్యాక్ వస్తుంది. ఒక శాతం క్యాష్బ్యాక్ పొందాలంటే ట్రాన్సాక్షన్ వ్యాల్యూ కనీసం 500 డాలర్లు ఉండాలి. అలాగే గరిష్టంగా ఒక కార్డుపై రూ.2,500 వరకు క్యాష్బ్యాక్ వస్తుంది. అంతేకాకుండా టాప్ 15,000 స్పండర్లకు మాత్రమే క్యాష్బ్యాక్ లభిస్తుంది.