దేశ మొట్ట మొదటి ప్రధాని పండిట్ నెహ్రూ జీవితం అందరికీ ఆదర్శమని... దేశాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన వ్యక్తుల్లో ఆయన ఒకరని కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయ ప్రిన్సిపాల్ శాహీన్ అన్నారు. ఈ మేరకు జవహర్ లాల్ నెహ్రూ 130వ జయంతి వేడుకలను ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగోండ మండల కేంద్రంలోని బాలికల విద్యాలయంలో నిర్వహించారు. నేటి బాలలే రేపటి పౌరులని.. ధనిక, పేదల లేకుండా అందరికి సమానంగా విద్యా అందాలని అభిలాషించిన వ్యక్తి నెహ్రూ అని ఉపాధ్యాయులు కొనియాడారు. అనంతరం విద్యార్థినులు సాంస్కృతిక ప్రదర్శనలు చేసి ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.