ఈ నెల 18 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నట్టు పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. సమావేశాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని పార్టీల నేతలతో నవంబర్ 17న భేటీ నిర్వహించనున్నట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాధ్ సింగ్ నేతృత్వంలో పార్ల మెంటరీ వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సిసిపిఎ) గురువారం భేటీ అయి, పార్లమెంట్ సమావేశాల షెడ్యూల్ను ఖరారు చేసింది. నవంబర్ 18 నుంచి డిసెంబర్ 13 వరకూ ఈ సమావేశాలు కొనసాగను న్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ లోక్సభ, రాజ్యసభ కార్యదర్శులకు షెడ్యూల్ పంపింది. దాదాపు నెల రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో ఎన్డిఎ ప్రభుత్వం పలు బిల్లులను సభ ముందుకు తీసుకురానున్నది. వీటిలో ఆదాయపు పన్ను చట్టం-1961, ఆర్థిక చట్టం-2019లను సవరిస్తూ, దేశీయ కంపెనీల కార్పొరేట్ పన్నును తగ్గిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్తోపాటు ఇ-సిగరెట్ల అమ్మకం, ఉత్పత్తి, నిల్వలను నిషేదిస్తూ తీసుకొచ్చిన అర్డినెన్స్ ఉన్నాయి.