బెంగళూరు: బెంగళూరు విమానాశ్రయంలో దేశీయ విమానాయాన సంస్థ గోఎయిర్కు చెందిన విమానంకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. నాగ్పూర్ నుంచి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న గోఎయిర్ విమానం ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పి రన్వేపై నుంచి పక్కకు వెళ్లింది. ప్రమాద సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణీకులందరూ క్షేమంగా బయట పడ్డారు.. జీ8-811 గోఎయిర్ విమానం గురువారం ఉదయం నాగ్పూర్ నుంచి బయలు దేరి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంకు 7:15 గంటలకు చేరుకుంది. ఇక ల్యాండ్ అవుతున్న సమయంలో రన్వేపై కాకుండా పక్కకు ల్యాండ్ అయ్యింది. బెంగళూరులో వాతావరణం సరిగ్గా లేకపోవడంతో రన్వే పైలట్లకు కనిపించలేదని గోఎయిర్ సంస్థ చెబుతోంది. ఇదిలా ఉంటే డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇద్దరు పైలట్లకు సమన్లు జారీ చేసింది.