రాజధాని ఢిల్లీలోని కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కాలుష్యంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. హైడ్రోజన్ ఆధారిత ఇంధనానికి సంబంధించిన జపాన్ టెక్నాలజీని అధ్యయనం చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై డిసెంబర్ 3వ తేదీలోగా ఒక నివేదిక సమర్పించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.