ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం టర్బైన్ జనరేటర్ యూనిట్ లో చోటు చేసుకున్న పేలుడు ఘటన కారణంగా అక్కడ పనిచేస్తున్న నలుగురు ఇంజనీర్లు తీవ్రంగా గాయపడ్డారు. సోనే భద్ర జిల్లాలో ఉన్న ఈ విద్యుత్ కేంద్రంలో బుధవారం రాత్రి విధుల్లో ఉండగా ఈ ఘటన చోటు చేసుకోగా గాయపడిన ఇంజనీర్లను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. కాగా ప్రమాదం జరిగిన వెంటనే ఆ ధికారుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు మంటల్ని అదుపు చేస్తున్నారు. యూపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్లాంట్ లో ప్రమాదం కారణంగా విద్యుత్ ఉత్పత్తికి ఆరు నెలలపాటు అంతరాయం కలగనుందని అధికారవర్గాల సమాచారం.