న్యూఢిల్లి : జార్ఖండ్ శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ 40 మంది స్టార్ క్యాంపైనర్లతో జాబితా విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్, ఆధిర్ రంజన్ చౌధురి, అశోక్ గెహ్లాట్, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు జార్ఖండ్లో ప్రచారం చేయనున్నారు.