శబరిమల కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది. ఈ కేసును ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీం తీర్పును ఇచ్చింది. మత విశ్వాసం అనేది పౌరుల హక్కు అని.. ఈ వివాదంపై ఇంకా చర్చ జరగాల్సి ఉందని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పేర్కొన్నారు. ఐదుగురు న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ కేసును విస్తృత ధర్మాసనం బదిలీ చేశారు. పెండింగ్ పిటిషన్లపై ఆ ధర్మాసనమే విచారణ చేస్తుందని సీజేఐ స్పష్టం చేశారు.