ట్రెండింగ్
Epaper    English    தமிழ்

67 ఎకరాల నుంచే 5 ఎకరాలివ్వాలి : ఇఖ్బాల్‌ అన్సారీ

national |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2019, 05:06 PM

అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న 67 ఎకరాల్లోనుంచే 5 ఎకరాలివ్వాలని బాబ్రీ మసీదు – రామజన్మభూమి కేసులో లిటిగెంట్‌ ఇఖ్బాల్‌ అన్సారీతో సహా పలువురు స్థానిక ముస్లిం నేతలు డిమాండ్‌ చేశారు. అయోధ్యలో వివాదాస్పద స్థలాన్నికేంద్ర ప్రభుత్వం 1991లో స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు అయోధ్య వివాదంపై తీర్పు చెబుతూ ముస్లింలకు మసీదు నిర్మాణం కోసం 5 ఎకరాలను ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దీనిపై అన్సారీ తదితరులు మాట్లాడుతూ తమకు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న 67 ఎకరాల్లోనుంచే 5 ఎకరాలు ఇస్తేనే తీసుకుంటామని లేకపోతే తాము ఈ ప్రతిపాదనను అంగీకరించబోమని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com