కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో సరయూ నది తీరం భక్తులతో కళకళలాడింది. 'రామ జన్మభూమి-బాబ్రీ మసీదు' కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన అనంతరం వచ్చిన తొలి కార్తీక పౌర్ణమి కావడంతో పోలీసులు ఘాట్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. ఉత్తర్ప్రదేశ్లోని వివిధ జిల్లాలకు చెందిన ప్రజలు సోమవారం రాత్రే అయోధ్య చేరుకుని నిద్రించారు. అనంతరం మంగళవారం తెల్లవారుజాము నుంచే ఘాట్లలో పవిత్ర స్నానాలు ఆచరించారు. మొత్తం 5 లక్షల మంది వరకు సరయూలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు అంచనా.