ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్ణాటక రెబెల్స్ ఎమ్మెల్యేల భవితవ్యంపై సంచనల తీర్పు

national |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2019, 12:31 PM

సుప్రీం కోర్టు కర్ణాటక రెబెల్స్ ఎమ్మెల్యేల భవితవ్యంపై సంచనల తీర్పు ఇచ్చింది. బుదవారం తీర్పు వెలువరించిన సుప్రీం కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన 17 మంది రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హులుగా ప్రకటించడాన్ని సమర్ధించింది. కానీ, వారిని ఉప-ఎన్నికల్లో పోటీకి అనుమతించింది. ఈమేరకు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. అక్టోబర్ 25న ఈ అంశంపై విచారణ పూర్తిచేసిన ధర్మాసనం.. తీర్పును బుధవారం వెల్లడించింది. అసెంబ్లీ గడువు ముగిసే వరకూ ఓ ఎమ్మెల్యేను స్పీకర్ అనర్హుడిగా ప్రకటించలేరని తెలిపింది.అంటే అనర్హులు ఉప ఎన్నికలలో పోటీ చేయవచ్చని, నామినేషన్లు దాఖలు చేయవచ్చని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాదు, ఎమ్మెల్యేగా ఎన్నికైతే క్యాబినెట్‌లో మంత్రిగా చేరవచ్చని స్పష్టం చేసింది. అయితే, రెబల్ ఎమ్మెల్యేలు తమను నేరుగా ఆశ్రయించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. హైకోర్టుకు వెళ్లకుండా తమ వద్దకు రావడం సమంజసంగా లేదని అభిప్రాయపడింది.వాస్తవాలు, కేసు యొక్క పరిస్థితులపై ఆధారపడి ఈ తీర్పును వెలువరించామని, స్పీకర్ అధికారంలో జోక్యం చేసుకోవడం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. శాసనసభలో రాజ్యాంగ బాధ్యత, నైతికత ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి వర్తిస్తుందని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పుతో రెబల్ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. మొత్తం 17 స్థానాలకు ఉప-ఎన్నికలు డిసెంబరు 5న జరగనుండగా, ఈ రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థులుగా బరిలో దిగనున్నారు.కర్ణాటకలో కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ప్రయోగించారు. కాంగ్రెస్‌కు చెందిన 13 మంది, జేడీఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. వారు తిరిగి ఉప-ఎన్నికల్లో పోటీచేయకుండా ప్రస్తుత శాసనసభ ముగిసేవరకూ అనర్హులుగా పేర్కొంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.దీంతో మొత్తం 17 మంది రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీంలో ఆ పిటిషన్‌పై విచారణ కొనసాగుతుండగా కేంద్ర ఎన్నికల సంఘం 15 చోటల్ ఉపఎన్నికల నోటిఫికేషన్ వెలువరించింది. దీంతో సుప్రీం తీర్పు వచ్చేంతవరకు ఉపఎన్నికలను నిలిపివేయాలని సుప్రీంను రెబల్స్ కోరారు. ఈ అభ్యర్థనను పరిశీలించాల్సిందిగా ఈసీకి సుప్రీం సూచించగా.. ఎన్నికలను వాయిదా వేశారు. తాజాగా ప్రకటించిన తేదీల ప్రకారం.. డిసెంబర్ 5న పోలింగ్ నిర్వహించి, 9న ఫలితాలు వెల్లడిస్తారు. నేటి సుప్రీం తీర్పుతో రెబల్స్ ఊపిరి పీల్చుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com