శబరిమలలో 10 వేల మంది పోలీసు అధికారులతో భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీనుంచి మూడు నెలలపాటు శబరిమలలో అయ్యప్ప స్వామి పూజలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా వేలాదిమంది భక్తులు అయ్యప్పను దర్శించుకోవడానికి వస్తారు. 24 మంది ఎస్పిలు, ఎఎస్పిలు, 112 మంది డిప్యూటీ ఎస్పిలు, 264 మంది ఇన్స్పెక్టర్లు, 1185 మంది సబిన్స్పెక్టర్లను శబరిమలలో విధుల నిర్వహణకు ప్రభుత్వం పంపింది. అలాగే 307 మంది మహిళా పోలీసులతో సహా 84-2 మంది సివిల్ పోలీస్ అధికారులను శబరిమల ఆలయం వద్ద భద్రత కోసం నియమించారు.