ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓ కూలికి దక్కిన అరుదైన గౌరవం

national |  Suryaa Desk  | Published : Tue, Nov 12, 2019, 08:42 PM

మన ప్రజాసామ్యంలో రైతులకు, కూలీలకు మంచి గౌరవం దక్కాలనే నేపథ్యంలో ఎందరో మహానుభావులు ఆ దిశగా కృషి చేశారు. అలాంటి వారి కృషికి తాజాగా బెంగుళూరులో జరిగిన ఓ సంఘటన సరైన గౌరవాన్ని తెచ్చి పెట్టిందనే చెప్పాలి. కూలి పని చేసుకుని జీవనాన్ని సాగించే ఓ కూలి బెంగుళూరులో జరిగే ఓ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా ఆహ్వానం పొందారు. అంతేకాదు, కూలీ కూతురు చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించిన అక్కడి అధికారులు అందరి ప్రశంసలు, మన్ననలను పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు నగరంలోని రైల్వేస్టేషన్‌‌లో ఇటీవల ఎస్కలేటర్‌ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఈ క్రమంలో ఆ ఎస్కలేటర్‌ ను ప్రారంభించి దాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే ఈ కార్యక్రమం ఈనెల 9వ తేదీన ఎంపీ పీసీ మోహన్‌ చేతుల మీదుగా ప్రారంభం కావాల్సి ఉండగా.. అదే రోజు అయోధ్య తీర్పు రావడంతో ఆయన  ఆ కార్యక్రమానికి రాలేకపోయారు. అయితే తాను రాలేకపోయినా కూడా ప్రారంభోత్సవం ఆపవద్దని అధికారులకు సూచించారు.  సామాన్యులకు ఉపయోగపడే నిర్మాణం కాబట్టి జాప్యం చేయకూడదని పేర్కొన్నారు.  ఎంపీ చెప్పిన మాటలతో వెంటనే అధికారులు సెలెబ్రెటీలతో కాకుండా సామాన్యుల చేతుల మీదుగానే దీన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఆ నిర్మాణంలో భాగం పంచుకున్న చాంద్‌బీ అనే మహిళ కూతురు బేగమ్మా చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేయించారు. దాని కోసం కష్టపడి పనిచేసిన వారికి ఈ విధంగా గుర్తింపు ఇచ్చినట్టుగా ఉండటంతో పాటు ప్రజలకు ఎస్క్‌లేటర్ అందుబాటులోకి వస్తుందని ఇలా చేశామని అధికారులు పేర్కొన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com