ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ద.మ. రైల్వేలో 4,103 అప్రెంటిస్ ట్రైనీలకు నోటిఫికేషన్‌ జారీ

national |  Suryaa Desk  | Published : Tue, Nov 12, 2019, 08:14 PM

దక్షిణమద్య రైల్వేలో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్ వంటి 4,103 సాంకేతిక విభాగాలలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. 10వ తరగతి+ఐ‌టిఐ పాస్ అయ్యి, డిసెంబరు 8నాటికి 15-24 సంల వయసు లోపున్ననవారు ఈ ట్రైనీ పోస్టులకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు తదితరులకు రిజర్వేషన్లు, వయోపరిమితి సడలింపు ఉన్నాయి. ఈ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులకు నవంబర్ 9వ తేదీ నుంచి డిసెంబరు 8వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.100.
ఖాళీల వివరాలు:
ఫిట్టర్: 1,460, ఎలక్ట్రీషియన్-871, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్: 18, ఎలక్ట్రానిక్ మెకానిక్: 102, ఏసీ మెకానిక్స్: 249, డీజిల్ మెకానిక్స్: 640, పెయింటర్స్: 40, వెల్డర్స్: 597, మెషినిస్ట్: 74, కార్పెంటర్: 16, ఎంఎండబ్ల్యూ: 24, ఎంఎంటీఎం:12, పోస్టులు భర్తీ చేయబడతాయి.వీటికి సంబందించి పూర్తి వివరాల కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.


----------






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com