న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అన్ని విద్యార్థి సంఘాలు ఈ ఆందోళనలో పాల్గొన్నాయి. సమస్యలపై యూనివర్శిటీ యాజమాన్యం స్పందించడం లేదనీ, ఫీజులు సైతం ఇష్టారీత్యా పెంచుతున్నారని వారు వాపోతున్నారు. ఓ ఆందోళన కారుడు మాట్లాడుతూ.. గత 15 రోజుల నుంచి ఫీజులు పెంచడంపై ఆందోళన చేస్తూనే ఉన్నాం. ఐనా వారు పట్టించుకోవడం లేదు. కనీసం 40 శాతం మంది విద్యార్థులు పేదరికం నుంచి వచ్చినవారే. వారెలా ఫీజులు చెల్లిస్తారని అతను వాపోయాడు. యూనివర్సిటీ వెలుపల విద్యార్థులు ఆందోళన చేస్తుంటే.. లోపల జేఎన్యూ స్నాతకోత్సవం(కాన్వకేషన్) జరగడం విశేషం. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.