అనంతపురంలో దారుణం జరిగింది. ఓ వివాహిత మహిళపై మరో మహిళ దాడి చేసింది. రేష్మా అనే మహిళ వివాహితుడు శ్రీనివాస్ను ప్రేమించింది. తమ ప్రేమకు అడ్డువస్తోందని సదరు మహిళ శ్రీనివాస్ భార్యపై బ్లేడుతో దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన శ్రీనివాస్ భార్యను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన నిందితురాలు రేష్మాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.