అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు నేడు వెలువరించిన తీర్పును గౌరవిస్తున్నామని, స్వాగతిస్తున్నామని అజ్మీర్ దర్గా ఆధ్మాత్మిక అధినేత దీవాన్ జైనుల్ అబెదిన్ అలీ ఖాన్ అన్నారు. అందరికంటే న్యాయవ్యవస్థ అత్యున్నతమైనదని, దాని నిర్ణయాన్ని ప్రతివారూ గౌరవించాలని ఆయన అన్నారు. భారతదేశం వైపు చూస్తున్న ప్రపంచానికి మన ఐక్యతను చాటి చెప్పాల్సిన తరుణమిదని ఆయన అన్నారు.