రాజ్యాంగం ప్రకారం మహారాష్ట్ర ప్రస్తుత శాసనసభ గడువు నేటితో ముగుస్తున్నందున ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నీవీస్ రాజీనామా చేయాలని శివసేన నేత సంజయ్ రవుత్ డిమాండ్ చేశారు. శివసేనకు రెండున్న ఏళ్లు సిఎం పదవి ఇచ్చే లేఖ నితిన్ గడ్కరీ వద్ద ఉంటే ఆ విషయం ఉద్ధవ్ థాకరేకు చెబుతానని ఆయన అన్నారు. అతి పెద్ద పార్టీగా అవతరించిన బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా రాష్ట్రపతి పాలన ద్వారా రాష్ట్రాన్ని పాలించాలనుకుంటే అది చాలా పెద్ద తప్పు అవుతుందని ఆయన అన్నారు. రాజ్యాంగ వ్యతిరేకమవుతుందని ఆయన చెప్పారు. కర్ణాటక తరహా గిమ్మిక్కులు ఇక్కడ నడవబోవని ఆయన స్పష్టం చేశారు.