ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చేజారిన తొలిటీ20...భారత్‌పై బాంగ్లా గెలుపు

international |  Suryaa Desk  | Published : Mon, Nov 04, 2019, 12:26 AM

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ పై బాంగ్లా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముష్ఫికర్ రహీమ్ (60 నాటౌట్: 43 బంతుల్లో 8x4, 1x6) అజేయ అర్ధశతకం బాదడంతో భారత్ నిర్దేశించిన 149 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.


టీ20 చరిత్రలో టీమిండియాపై బంగ్లాదేశ్ గెలుపొందడం ఇదే తొలిసారి కావ‌టం విశేషం. ఈ మ్యాచ్ లో భారత బ్యాట్స్‌మెన్ ఆశించిన ప‌రుగులు రాబ‌ట్టుకోలేకపోయారు. ఓపెనర్ శిఖర్ ధావన్ (41: 42 బంతుల్లో 3x4, 1x6) మాత్రమే కాస్త ఫర్వాలేదనిపించాడు.


 టాస్ ఓడిన‌ తొలుత బ్యాటింగ్  చేయాల‌ని బంగ్లా కోర‌టంతో రంగంలోకి దిగిన  టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు మాత్ర‌మే చేయగలిగింది.   తొలి మ్యాచ్ ఆడిన యువ పవర్ హిట్టర్ శివమ్ దూబే (1) అస్స‌లు రాణించ‌లేదు. 


బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా   ఫీల్డింగ్ లో ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ జ‌ట్టుని అప్ర‌మ‌త్తం చేయ‌టంతో  ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన కెప్టెన్ రోహిత్ శర్మ (9: 5 బంతుల్లో 2x4) తొలి ఓవర్‌లోనే రెండు ఫోర్లు బాది ఔటైపోగా  తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ (15: 17 బంతుల్లో 2x4) బంతి గమనాన్ని అంచనా వేయడంలో విఫలమై వికెట్ చేజార్చుకున్నాడు. ఇక  శ్రేయాస్ అయ్యర్ (22: 13 బంతుల్లో 1x3, 2x6) సిక్స్ కొట్టే ప్రయత్నంలో ఔటైపోయాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ (27: 26 బంతుల్లో 3x4) 19వ ఓవర్ వరకూ క్రీజులో నిలిచినా..  పరుగులు రాబట్టలేకపోయాడు. కానీ.. చివరి రెండు ఓవర్లలో కృనాల్‌ పాండ్య (15 నాటౌట్: 8 బంతుల్లో 1x4, 1x6), వాషింగ్టన్ సుందర్ (14 నాటౌట్: 5 బంతుల్లో 2x6) భారీ షాట్లు ఆడి మెరుగైన స్కోరుని టీమ్‌కి అందించారు. 


ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బాంగ్లా జ‌ట్టు ఆట‌గాళ్లు ఆచితూచి ఆడుతూ 154/3 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం నమోదు చేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com