మీడియా స్వేచ్ఛ ను హరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 2430 ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ( ఏపీయుడబ్ల్యూ జే,) ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 11.గంటలకు అనంతపురము లో ప్రెస్ క్లబ్ నుంచి గాంధీ విగ్రహం వరకు నిరసన కార్యక్రమం జరిగింది. జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ను వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేస్తూ గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం జీఓ ను ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేయటం జరుగుతోందని జర్నలిస్ట్ నాయకులు హెచ్చరించారు ప్రభుత్వం ఇప్పటికైనా జీవో ని వెనక్కి తీసుకోవాలని జర్నలిస్టులు సూచించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీయుడబ్ల్యూ జే జిల్లా కార్యదర్శి లక్ష్మి నారాయణ, ఆంధ్రజ్యోతి ఎడిష న్ ఇంచార్జ్ నాగభూషణం, ఆంధ్ర ప్రభ ఎడిష న్ ఇంచార్జ్ మార్కండేయులు, ఐ జేయు సభ్యులు ప్రభాకర్ నాయుడు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు రసూల్, ప్రవీణ్, టిడిపి రాజారావు, నమస్తే అమరావతి ఎడిటర్ పూల శెట్టి చలపతి, ఏపీయూడబ్య్లూజే జిల్లా కోశాధికారి చౌడప్ప, ఏపీయూడబ్య్లూజే జిల్లా ఉపాధ్యక్షుడు లోకరాజు, ఆంధ్ర జ్యోతి స్టాఫర్ రామకృష్ణ, ఏపీయూడబ్య్లూజే కార్యవర్గ సభ్యులు, ఎలక్ట్రాన్ మీడియ ప్రతినిధులు, చిన్న పత్రికల ప్రతినిధులు, వివిధ పత్రికల జర్నలిస్టులు, సబ్ ఎడిటర్లు, ఫోటో గ్రాఫర్ లు పాల్గొన్నారు.