ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి చేసుకుంటానని చెప్పి.. హోటల్‌లో ఉంచి అత్యాచారం..!

national |  Suryaa Desk  | Published : Thu, Oct 31, 2019, 01:39 PM

తనను పెళ్లిచేసుకుంటానని చెప్పి 15 ఏళ్ళ బాలుడు తనపై అత్యాచారం చేసాడని 21ఏళ్ళ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన చండీగఢ్‌లో జరిగింది. సెక్షన్‌ 164 ప్రకారం బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు.. నిందితుడైన మైనర్‌ను జువెనైల్‌ హోమ్‌కు తరలించారు.


నిందితుడు తనను ముంబైకి తీసుకెళ్లి ఒక హోటల్‌లో ఉంచి తనపై అత్యాచారం జరిపినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే నిందితుడి కుటుంబసభ్యులు మాత్రం ఈ ఆరోపణలు కొట్టిపారేస్తున్నారు. సదరు యువతి, బాలుడితో కలిసి ఇంటినుంచి పారిపోయి.. ముంబై వెళ్లిపోయారని, ఇరు కుటుంబసభ్యులు వారిని ఒప్పించి తిరిగి ఇంటికి తీసుకొచ్చారని వారు అంటున్నారు. యువతి, బాలుడి ఒకరికొకరు తెలుసునని, నెలన్నర కింద వారు ఇంటినుంచి పారిపోయి ముంబైలో గడిపారని, అక్కడి నుంచి తీసుకొచ్చాక, బాలిక తల్లి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసిందని మైనర్‌ బంధువులు అంటున్నారు. ఈ కేసుపై పోలీసులు స్పందిస్తూ.. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొదట ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి.. కేసును విచారిస్తున్నామని, అసలు ఏం జరిగిందన్నది తెలుసుకొని.. దాని ఆధారంగా నిందితుడైన మైనర్‌ను జువెనైల్‌ జస్టిస్‌ బోర్డుముందు ప్రవేశపెడతామని చెప్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com