రాజకీయంగా రాటుదేలాలంటే కొన్ని ఒత్తిళ్లు భరించాలని విజయవాడ ఎంపీ కేశినాని వ్యాఖ్యానించారు. ఇటీవల తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వల్లభనేని వంశీతో దాదాపు 3గంటల పాటు సమావేశమైన కేశినేని అనంతరం మీడియాతో మాట్లాడారు. చెప్పాల్సిందంతా చెప్పామని, ఇప్పుడు బంతి వంశీ కోర్టులో ఉందన్నారు. కుటుంబం, వ్యాపారంలో ఉన్నట్లే రాజకీయాల్లో సమస్యలు ఉంటాయని, రాజకీయంగా రాటుదేలాలంటే కొన్ని ఒత్తిళ్లు భరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వీరోచితంగా పోరాడి గెలిచిన వంశీ ఇప్పుడు వెన్ను చూపడం మంచిది కాదని హితవుపలికారు. పారిపోవడం మొదలు పెడితే జీవితాంతం పారిపోవాల్సి వస్తుందని చెప్పారు. వంశీకి టీడీపీ ఎంత అవసరమో పార్టీకి కూడా వంశీ అంతే అవసరమని నాని తెలిపారు.