రాయలసీమలోనే రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. ప్రత్యేక రాయలసీమ డిమాండ్ చేసే పరిస్థితులు తేవద్దని సూచించారు. స్టడీ పేరుతో కాలయాపన చేసే కంటే.. మూడు ప్రాంతాలకు 3 రాజధానులు ఇస్తే సరిపోతుందని చెప్పారు. రాయలసీమ డిక్లరేషన్ అమలయ్యే వరకు పోరాటం ఆగదన్నారు. రాయలసీమపై రాంగోపాల్ వర్మ మంచి సినిమాలు తీస్తే బాగుంటుందని హితవు పలికారు.