ఏపీలో రాజకీయ పార్టీ నేతల మధ్య విమర్శలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. సోషల్ మీడియా వేదికగా బూతు పురాణం అందుకుంటున్నారు. ఒకరి పై ఒకరు సవాళ్లు విసురుకుంటూ సోషల్ మీడియాను రణరంగం చేస్తున్నారు. తాజాగా తెలుగుదేశం నేత బుద్ద వెంకన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై, విజయసాయి రెడ్డి పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసారు. "అయ్యా విజయసాయి రెడ్డిగారు , ట్విట్టర్ లో ఇసుక కొరత లేదు అని మీరు సెలవిచ్చారు బానే ఉంది, మరి మీ మేధావి జగన్ ఇసుక వారోత్సవాలు ఎందుకు చేస్తున్నట్టు... ? మీ వైకాపా ఇసుక మాఫియా ట్రాక్టర్ డ్రైవర్లపై దాడులు చేసి ఇసుక ఎత్తుకుపోతున్నారు, అడ్డొస్తే చంపడానికి కూడా వెనకాడడంలేదు.రాష్ట్రంలో కృత్రిమ ఇసుక కొరత సృష్టించి పందికొక్కుల్లా ఇసుకని తింటూ, భవన నిర్మాణ కార్మికులని మింగేస్తున్న మీరు ఇసుక గురించి నీతులు మాట్లాడుతున్నారా విజయసాయిరెడ్డి గారు? పిల్లి పాలు తాగుతూ ఎవరూ చూడలేదన్నట్లుగా ఉంది మీ వ్యవహారం. దమ్ముంటే ఇసుక కొరత లేదని ప్రజల్లోకి వెళ్లి చెప్పండి.. ? అంటూ రాసుకొచ్చారు.