దేశ రాజధాని న్యూఢిల్లీ వర్సిటీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ మేరకు 'దేశంలో పార్లమెంటరీ వ్యవస్థ-బలోపేతం' అన్న అంశంపై కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ తొలి స్మారకోపన్యాసం చేశారు. చట్టసభల నిర్వహణలో కొన్ని కీలకమైన సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో మరిన్ని మార్పులు (సంస్కరణలు) తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ మంగళవారం రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులను దిల్లీలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.