విద్యార్థుల్లో గురుభక్తి, దేశభక్తిని పెంపొందించేందుకు భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల్లో ‘గురువందన్…ఛాత్రాభినందన్’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తుని మండలం ఎన్. సూరవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువందన్ ఛాత్రాభినందన్ కార్యక్రమాన్ని భారత్ వికాస్ పరిషత్ నిర్వహించింది. ఈ సందర్భంగా 2019 టెన్త్ ఫలితాల్లో టాపర్ గా నిలచిన విశ్వనాధుని శ్రావణి ని , ఆమె తల్లిదండ్రులను అభినందిస్తూ ఘనంగా సత్కరించారు. విద్యార్థిని శ్రావణి విజయంలో పాత్రవహించిన సైన్స్ ఉపాధ్యాయిని జె. పార్వతిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో భారత్ వికాస్ పరిషత్ తుని శాఖ అధ్యక్షులు ఎస్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థుల్లో విలువలు, దేశభక్తి, గురుభక్తిని పెంపొందించేందుకు భారత్ వికాస్ పరిషత్ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. విద్యార్ధులకు క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యను అందించి వారి అభ్యున్నతికి ఉపాధ్యాయులు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బివిపి తుని శాఖ కార్యదర్శి చదరం శివాజీ , రాష్ట్ర కార్యదర్శి మంతెన సూర్యనారాయణరాజు, రాష్ట్ర నాయకులు వి.ఎస్.ఆర్ ఆంజనేయ ప్రసాద్ , సమయమంతుల కృష్ణాజీ, డి వి ఎల్ ఎన్ ప్రసాద్, పి శివ కుమార్, నడిగట్ల సుబ్బారాయుడు, అనిల్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.