ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థుల్లో విలువలు పెంచేందుకు “గురువందన్… ఛాత్రాభినందన్”

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 30, 2019, 01:59 PM

విద్యార్థుల్లో గురుభక్తి, దేశభక్తిని పెంపొందించేందుకు భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల్లో ‘గురువందన్…ఛాత్రాభినందన్’ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తుని మండలం ఎన్. సూరవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువందన్ ఛాత్రాభినందన్ కార్యక్రమాన్ని భారత్ వికాస్ పరిషత్ నిర్వహించింది. ఈ సందర్భంగా 2019 టెన్త్ ఫలితాల్లో టాపర్ గా నిలచిన విశ్వనాధుని శ్రావణి ని , ఆమె తల్లిదండ్రులను అభినందిస్తూ ఘనంగా సత్కరించారు. విద్యార్థిని శ్రావణి విజయంలో పాత్రవహించిన సైన్స్ ఉపాధ్యాయిని జె. పార్వతిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో భారత్ వికాస్ పరిషత్ తుని శాఖ అధ్యక్షులు ఎస్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థుల్లో విలువలు, దేశభక్తి, గురుభక్తిని పెంపొందించేందుకు భారత్ వికాస్ పరిషత్ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. విద్యార్ధులకు క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యను అందించి వారి అభ్యున్నతికి ఉపాధ్యాయులు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బివిపి తుని శాఖ కార్యదర్శి చదరం శివాజీ , రాష్ట్ర కార్యదర్శి మంతెన సూర్యనారాయణరాజు, రాష్ట్ర నాయకులు వి.ఎస్.ఆర్ ఆంజనేయ ప్రసాద్ , సమయమంతుల కృష్ణాజీ, డి వి ఎల్ ఎన్ ప్రసాద్, పి శివ కుమార్, నడిగట్ల సుబ్బారాయుడు, అనిల్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com