జమ్ము కాశ్మీర్లో ఇంటర్నెట్ సేవలను సస్పెండ్ చేయడం ద్వారా ఉగ్రదాడులను నివారించగలిగామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. రాష్ట్రంలో ఇంటర్నెట్పై విధించిన నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నవారు జమ్ము కాశ్మీర్లో ఇంకా ఉగ్రవాదం కొనసాగాలని కోరుకుంటూ ఉండవచ్చునని లేదా దేశ సార్వభౌమత్వాన్ని, సాధారణ పౌరుల భద్రతను పణంగా పెట్టి రాజకీయాలు చేయాలని చూస్తున్నవారై ఉండవచ్చుని ఆయన చెప్పారు. కిష్టావర్లో జరిగిన రెండు సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ జిల్లనుంచి అనేకమంది ఉగ్రవాదులను ఏరివేయడం ఇంటర్నెట్ను సస్పెండ్ చేయడం వల్లే సాధ్యమైందని అన్నారు.