భారత్, సౌదీ అరేబియా దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ప్రధాని మోడీ సౌదీ పర్యటన సందర్భంగా సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్, క్రౌన్ ప్రిన్స్ మొహ్మద్ బిన్ సల్మాన్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్, సౌదీల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఏర్పాటుకు వారు ఒప్పందం కుదుర్చుకున్నారు. పౌదీలో రుపే కార్డును ప్రారంభించారు.